తెలంగాణలో ‘ఆదిపురుష్‌’ అడ్వాన్స్‌ బుకింగ్‌ అప్పటి నుంచే..

by Disha Web Desk 9 |
తెలంగాణలో ‘ఆదిపురుష్‌’ అడ్వాన్స్‌ బుకింగ్‌ అప్పటి నుంచే..
X

దిశ, సినిమా: ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓం రౌత్ దర్శకత్వంలో తెరక్కిన ఈ మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే పలు నగరాల్లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ప్రారంభం కాగా, ఈ మేరకు తాజాగా తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్‌‌పై క్లారిటి ఇచ్చారు. తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్‌కు బుధవారం (జూన్ 14) నుంచి ప్రారంభం కానున్నట్లు బుక్ మై షో ప్రకటించింది. తమ అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా ఈ విషయాన్ని తెలియాజేశారు.

Also Read: ‘ఆదిపురుష్’ రూ.500 కోట్లు డెస్ట్‌‌బిన్ లోకే.. మతపరమైన సినిమాను నాశనం చేసినందుకు మేకర్స్‌కు సిగ్గుండాలి..

Next Story